
జనరల్

పోటీ చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై తాము సొంతంగా దర్యాప్తు చేయడంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విఫలమైందని అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ ఆరోపించింది. పోటీదారులు చేసిన ఆరోపణలను యథాతథంగా “కాపీ-పేస్ట్” చేస్తోందని యాపిల్ విమర్శించింది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో తమ వాటా 6 శాతానికి లోపే ఉందని పేర్కొంటూ, తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.
సీసీఐ స్వతంత్రంగా విశ్లేషణ చేయకుండా ప్రత్యర్థుల ఆరోపణల ఆధారంగా దర్యాప్తు కొనసాగించడం సరైంది కాదని యాపిల్ పేర్కొంది. యాప్ స్టోర్ విధానాల్లో మార్పులు చేస్తే తమ వ్యాపార మోడల్ దెబ్బతింటుందని, అది నియంత్రణ అనిశ్చితిని పెంచుతుందని తెలిపింది. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులపై కూడా ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ కేసులో జూలై 21న క్లోజ్డ్ డోర్ విచారణ జరగనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!