

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జీఎస్టీ రాబడులను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్తో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో సంస్కరణలు చేపట్టి, ఏఐ ఆధారిత సమాచారంతో పన్ను వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
భవన నిర్మాణ రంగంలో లీకేజీలను అరికట్టేందుకు మున్సిపల్, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖల మధ్య సమన్వయాన్ని ఏఐ ద్వారా బలోపేతం చేయాలని సూచించారు. అనుమతుల దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలు, పన్నుల అంచనాలను నమోదు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి డేటాను సమీకరించడం ద్వారా పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!