

గత కొన్ని రోజులుగా, వివిధ దేశాల ఇన్స్టాగ్రామ్ యూజర్లకు వరుసగా పాస్వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లడం వల్ల కలకలం రేగింది. చాలా మంది వినియోగదారులు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుని తమ అకౌంట్ భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. కొన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థలు కూడా అలర్ట్ ఇచ్చి, మిలియన్ల కొద్దీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ డేటా భద్రతకు ముప్పు ఎదుర్కోవచ్చని హెచ్చరించారు. రిపోర్ట్ల ప్రకారం యూజర్ల అకౌంట్ పేర్లు, ఫిజికల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు లీక్ అయ్యి డార్క్ వెబ్లో విక్రయానికి ఉంచబడ్డాయని భావించబడింది, ఇది వినియోగదారుల్లో ఆందోళనకు దారి తీసింది.
అయితే, ఇన్స్టాగ్రామ్ వెంటనే దీనిపై స్పష్టత ఇచ్చింది. యూజర్ల డేటా సురక్షితం అని భరోసా ఇచ్చింది. చిన్న సాంకేతిక లోపం కారణంగా పాస్వర్డ్ రీసెట్ ఈమెయిల్స్ అనవసరంగా పంపబడ్డాయని ఎక్స్ వేదిక ద్వారా తెలిపారు. ఏ అకౌంట్ కు ప్రమాదం లేదని, అన్ని సిస్టమ్స్ భద్రంగా ఉన్నాయని తెలిపారు. ఇన్స్టాగ్రామ్ ఈ గందరగోళానికి క్షమాపణలు తెలిపి, సమస్యను సరిచేశామని వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!