

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత సెమీకండక్టర్ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి చేరుకుంది. సోమవారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దేశీయంగా రూపొందించిన తొలి ఇంటెలిజెంట్ పవర్ సిస్టమ్-ఆన్-చిప్ (SoC) ‘అర్క జీకేటీ–1’ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ చిప్ను సైయెంట్ సెమీకండక్టర్స్ మరియు అజిముత్ ఏఐ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ప్రాజెక్టు భారత్లో సెమీకండక్టర్ డిజైన్ సామర్థ్యాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో చూపిస్తున్నదని మంత్రి తెలిపారు. దీంట్లో మల్టీకోర్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ అనలాగ్ సెన్సింగ్, మెమరీ, ఇంటెలిజెంట్ పవర్ మేనేజ్మెంట్ వంటి అనేక కీలక టెక్నాలజీలను ఒకే చిప్లో సమగ్రపరిచారు.
సైయెంట్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు మాట్లాడుతూ -- ఈ SoC విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా రూపొందించబడిందని, భవిష్యత్ స్మార్ట్ యుటిలిటీలు, అధునాతన మీటరింగ్ సిస్టమ్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి అనేక రంగాల్లో ఇది గేమ్-చేంజర్ అవుతుందని తెలిపారు.
అజిముత్ ఏఐ వ్యవస్థాపకుడు ప్రవీణ్ వై మాట్లాడుతూ --
‘అర్క జీకేటీ -1’ భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్ మ్యాప్లో మరింత బలంగా నిలబడేందుకు ముందడుగు అవుతుందని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!