

మెటా, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్, గూగుల్ వంటి అంతర్జాతీయ బిగ్ టెక్ సంస్థలు ఈ ఏడాది భారత్లో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టాయి. నియామక సంస్థ ఎక్స్ఫెనో నివేదిక ప్రకారం, 2026లో ఇప్పటివరకు ఈ సంస్థలు కలిపి సుమారు 13,600 మంది ఉద్యోగులను నియమించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం అధికం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కోర్ ఇంజనీరింగ్ రంగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి.
అమెరికాలో పెరుగుతున్న వీసా ఖర్చులు, అవుట్సోర్సింగ్కు సంబంధించిన విధాన మార్పులు కారణంగా పలు అంతర్జాతీయ సంస్థలు తమ డీప్-టెక్ ప్రాజెక్టులను భారత్కు మళ్లిస్తున్నాయి. జనరేటివ్ ఏఐ ఇంజినీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు, డేటా ఇంజినీర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు సాధారణ ఐటీ ఉద్యోగాల నియామకాలు కొంత మందగించినప్పటికీ, 2026 చివరి నాటికి బిగ్ టెక్ కంపెనీల నియామకాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!