
టెక్నాలజీ

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుబంధు వంటి పథకాల ద్వారా కోటీశ్వరులు కూడా లబ్ధి పొందుతున్నారని పేర్కొంది. అర్హతలను సరిగ్గా గుర్తించకుండా ఉచిత ప్రయోజనాలు అందించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, ఈ విధానం భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలని సూచించింది.
అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని, బాగా చదువుకునే విద్యార్థులకు ఫీజు సాయం చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకప్పుడు దేశానికి మనం ఏమి ఇచ్చామనే ఆలోచన ఉండేదని, ఇప్పుడు దేశం మనకేమి ఇచ్చిందనే పరిస్థితి వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఉచిత పథకాల అమలులో అర్హత, అవసరానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!