

అమెరికాకు చెందిన ఏఐ సంస్థ Anthropic మానవ ప్రమేయం లేకుండా క్లిష్టమైన కార్యాలయ పనులను స్వయంగా పూర్తి చేసే కొత్త ఏఐ టూల్ను ప్రవేశపెట్టింది. క్లాడ్ కోవర్క్ పేరుతో రూపొందించిన ఈ ప్లాట్ఫామ్ పూర్తిస్థాయి డిజిటల్ ఉద్యోగిలా పనిచేస్తుందని సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న OpenAI రూపొందించిన ChatGPT, Google జెమినై, అలాగే xAI రూపొందించిన టూల్స్ వినియోగదారుల సూచనల మేరకు స్పందిస్తే, కొత్త టూల్ స్వయంగా నిర్ణయాలు తీసుకుని ఫైళ్లను విశ్లేషించడం, ఒప్పందాలను పరిశీలించడం, నివేదికలను తయారు చేయడం వంటి పనులను నిర్వహించగలదని తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ టెక్ మార్కెట్లలో కలకలం రేగి, ఐటీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి.
నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఇటువంటి టెక్నాలజీ ఔట్సోర్సింగ్ ఆధారిత ఐటీ వ్యాపార నమూనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ క్లయింట్లపై ఆధారపడిన భారత ఐటీ రంగానికి ఇది సవాలుగా మారొచ్చని భావిస్తున్నారు. లేబర్ ఆధారిత బిల్లింగ్ మోడల్పై పనిచేసే సంస్థలకు ఏఐ కారణంగా ఆదాయ పరిమాణం తగ్గే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో అధిక విలువ కలిగిన కన్సల్టింగ్ సేవలు, ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారాలు, సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టిన ఉద్యోగాలకు మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!