

అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు దులీప్ ట్రోఫీ 2026లో బరిలోకి దిగడంతో దేశవాళీ టోర్నీకి మరింత ఆసక్తి ఏర్పడింది. సౌత్ జోన్తో జరిగిన ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా నిలిచింది. అయితే ఫైనల్లో ఈస్ట్ జోన్ అనుసరించిన వ్యూహంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇచ్చి 20 వికెట్లు తీసేందుకు ప్రయత్నించకుండా సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ 708 పరుగులు చేయగా.. సౌత్ జోన్ 338 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్కు 372 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అయితే సౌత్ జోన్కు ఫాలోఆన్ ఇవ్వకుండా ఈస్ట్ జోన్ మరోసారి బ్యాటింగ్కు దిగింది. ఐదో రోజు మధ్యాహ్నానికి 338/7 స్కోరు చేయడంతో ఫలితంపై ఆశలు సన్నగిల్లాయి. దీంతో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 13 ఏళ్ల తర్వాత ఆ జట్టు దులీప్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విధానాన్ని గావస్కర్ విమర్శిస్తూ.. దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్లోనే బౌలర్లు 20 వికెట్లు తీసే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బ్యాటర్లు హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచుకున్నట్లే.. బౌలర్లు రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 10 వికెట్లు తీసే సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!