

సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ 2-1 తో ఓడిపోవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్ ఈసారి వన్డేల్లోనూ ఆధిపత్యం చెలాయించి చరిత్ర సృష్టించారు. వడోదరలో తొలి వన్డే ఓటమి తర్వాత క్రమశిక్షణతో ఆడిన న్యూజిలాండ్ జట్టు సిరీస్ను కైవసం చేసుకోగా, భారత జట్టు మాత్రం ప్రణాళిక లోపాలు, అస్పష్టమైన వ్యూహాలతో తడబడింది. బ్యాటింగ్లో స్థిరత్వం లేకపోవడం, బౌలింగ్లో ప్రభావం చూపకపోవడం ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి.
గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస పరాజయాలు ఎదురవుతున్నాయంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవర్ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, ఫామ్లో లేని ఆటగాళ్లను కొనసాగించడం, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడం వంటి నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. ఇప్పటికే స్వదేశంలో కివీస్, దక్షిణాఫ్రికాలతో టెస్ట్ సిరీస్లు కోల్పోయిన గంభీర్పై ఇప్పుడు వన్డే సిరీస్ ఓటమితో ఒత్తిడి మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ కూడా జోరుగా సాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!