

టీమ్ ఇండియా మాజీ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె మళ్లీ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) కుటుంబంలో చేరారు. భారత జట్టు అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఆయనను క్రికెట్ స్ట్రాటజీ హెడ్గా నియమిస్తున్నట్లు కేకేఆర్ ప్రకటించింది. ఈ బాధ్యతల్లో భాగంగా కేకేఆర్కు చెందిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీల కోసం ఆటగాళ్ల ఎంపిక, స్క్వాడ్ ప్రణాళిక, ప్రతిభావంతుల గుర్తింపు, ప్రదర్శన విశ్లేషణ వంటి కీలక అంశాలను పర్యవేక్షించనున్నారు. అలాగే సీపీఎల్లో ట్రిన్బాగో నైట్రైడర్స్, ఐఎల్టీ20లో అబుధాబి నైట్రైడర్స్, మేజర్ లీగ్ క్రికెట్లో లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ జట్లకు అసిస్టెంట్ కోచ్గా కూడా సేవలందించనున్నారు.
ఈ సందర్భంగా కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ, ర్యాన్ టెన్ డస్కాటెకు నైట్రైడర్స్ తత్వం, పని విధానం గురించి పూర్తి అవగాహన ఉందని, అంతర్జాతీయ మరియు ఫ్రాంచైజీ క్రికెట్లో ఆయనకు ఉన్న విశేష అనుభవం సంస్థ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. స్పందించిన ర్యాన్ టెన్ డస్కాటె, మళ్లీ నైట్రైడర్స్ కుటుంబంలో చేరడం ఆనందంగా ఉందని, కోచింగ్ మరియు అనలిటిక్స్ బృందాలతో కలిసి పని చేస్తూ స్కౌటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్కు బలమైన ఆటగాళ్ల వ్యవస్థను రూపొందించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!