

లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలు ప్రకటించిన నేపథ్యంలో క్రిస్టియానో రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2016లో అర్జెంటీనా కోపా అమెరికా ఫైనల్లో ఓడిన తర్వాత మెస్సీ తొలిసారి అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ సమయంలో రొనాల్డో మెస్సీకి మద్దతుగా నిలిచి, అతడి భావోద్వేగాలను అభిమానులు అర్థం చేసుకోవాలని కోరాడు. మెస్సీ తిరిగి తన దేశం తరఫున ఆడాలని కూడా ఆశించాడు.
మెస్సీ తాజా నిర్ణయంపై రొనాల్డో ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. అయితే ఇటీవల తన ట్రెయినింగ్ ఫొటోను “Keep pushing” అనే క్యాప్షన్తో పోస్ట్ చేయడంతో అభిమానులు దానిని మెస్సీకి అనుసంధానిస్తూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. 2016లో రొనాల్డో కోరుకున్నట్టుగానే మెస్సీ తిరిగి వచ్చి 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లతో పాటు 2022 ఫిఫా ప్రపంచకప్ను అర్జెంటీనాకు అందించాడు. మరోవైపు రొనాల్డో ఇప్పటికీ పోర్చుగల్ తరఫున ఆడుతున్నాడు. తన అంతర్జాతీయ భవిష్యత్తుపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!