

తెలంగాణ కాంగ్రెస్లో తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుతో మంత్రి కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లారు. ఆమె కేసీ వేణుగోపాల్తో భేటీ కానుండగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ను కూడా కోరినట్లు సమాచారం. ఇటీవల గీసుకొండలో సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సురేఖతో పాటు చిన్నారెడ్డి వ్యవహారంపై రూపొందించిన నివేదికను కూడా టీపీసీసీ అధిష్ఠానానికి పంపిన నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న భేటీలపై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!