

అఫ్గానిస్థాన్తో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ గాయపడినట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో కొంతకాలంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్న హార్దిక్ ఇటీవల పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం వెలువడింది.
దీంతో అఫ్గాన్ సిరీస్కు హార్దిక్ అందుబాటులోకి వస్తాడని అభిమానులు భావించారు. అయితే తాజాగా శిక్షణ సమయంలో అతడి కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో అఫ్గానిస్థాన్తో సిరీస్లో హార్దిక్ రీఎంట్రీపై సందేహాలు నెలకొన్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ ఈ వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ప్రకటన సమయంలోనే హార్దిక్ పాండ్య అందుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!