

ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా ఆదివారం జరిగిన కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. టాస్ గెలిచిన కెప్టెన్ రజత్ పటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనతో ముంబై టాపార్డర్ను కుదేలు చేశాడు. అతడు 23 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. ర్యాన్ రికెల్టన్ (2), రోహిత్ శర్మ (22), సూర్యకుమార్ యాదవ్ (0) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.

అయితే తిలక్ వర్మ 57 పరుగులతో పోరాట పటిమ కనబర్చగా, నమన్ ధీర్ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై బౌలర్ కోర్బిన్ బాష్ 4 వికెట్లు తీసి ఆర్సీబీని కష్టాల్లోకి నెట్టినా, కృనాల్ పాండ్య 46 బంతుల్లో 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను మలుపు తిప్పాడు. జాకబ్ బెథెల్ 27 పరుగులతో సహకరించగా, ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి విజయం సాధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!