

హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను కచ్చితంగా వసూలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించి, క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలని స్పష్టం చేస్తూ, మిల్లర్ల బ్లాక్మెయిల్ను సహించబోనని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులను స్వాధీనం చేసుకుని వాటిని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ధాన్యం అధికంగా దిగుబడి అయ్యే ప్రాంతాల్లో ఐదు నియోజకవర్గాలను ఎంపిక చేసి 50 నుంచి 100 ఎకరాల్లో గోడౌన్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. గోడౌన్ల నిర్మాణానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవాలని, ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!