

2028 ఐసీసీ టీ20 ప్రపంచకప్కు కొత్త పోటీ విధానాన్ని ప్రకటించారు. టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ప్రారంభ దశలో నాలుగు జట్ల చొప్పున ఐదు గ్రూపులుగా విభజించి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. ప్రతి గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-10 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్-10లో ఐదు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉండగా, ప్రతి గ్రూప్ విజేత నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది.
మిగిలిన రెండు సెమీఫైనల్ స్థానాలను నిర్ణయించేందుకు తొలిసారిగా ఎలిమినేటర్ రౌండ్ను ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతి సూపర్-10 గ్రూప్లో రెండో స్థానంలో నిలిచిన జట్లు, మరో గ్రూప్లో మూడో స్థానంలో నిలిచిన జట్లతో తలపడతాయి. ఈ మ్యాచ్ల విజేతలు సెమీఫైనల్కు చేరుకుంటారు. ప్రస్తుతం ఉన్న ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్తో పాటు 12 జట్లు నేరుగా అర్హత సాధించగా, మిగిలిన ఎనిమిది స్థానాల కోసం 16 జట్లు గ్లోబల్ క్వాలిఫయర్లో పోటీపడనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!