
సినిమాలు

దోహాలో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత గ్రాండ్మాస్టర్లు కొనేరూ హంపీ, అర్జున్ ఎరిగైసి అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాలు సాధించారు. విజయవాడకు చెందిన హంపీ ఈ టోర్నీలో తన ఐదవ పతకాన్ని గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో తన స్థిరత్వాన్ని మరోసారి నిరూపించారు.
వరంగల్కు చెందిన అర్జున్ ఎరిగైసి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తన మొదటి పతకాన్ని గెలుచుకుని అరుదైన ఘనత సాధించారు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత, వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో పోడియం ఫినిష్ సాధించిన ఏకైక భారత పురుష ఆటగాడిగా అర్జున్ నిలిచారు. ఈ విజయాలు తెలుగు గ్రాండ్మాస్టర్ల ప్రతిభను ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెప్పాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!