4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

Writer: Sreekanth Reddy 12:20 AM, 20 జులై, 2026
వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించినా విజయం దక్కలేదు. 388 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ (110 బంతుల్లో 138; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుత శతకంతో అలరించాడు. అతనికి జతగా గిల్ (84 బంతుల్లో 77) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుపై ఆశలు రేపారు. గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 74) కూడా దూకుడుగా ఆడాడు. రోహిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించి స్కోరుబోర్డును నడిపించాడు.

అయితే, కీలక సమయంలో రోహిత్.. బెతెల్ బౌలింగ్ లో ఔటవ్వడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మ్యాచ్ ఇక్కడే మలుపు తిరిగింది. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (14), శ్రేయస్ అయ్యర్ (0) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ దశలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ విజృంభించాడు. కీలకమైన కోహ్లీ వికెట్‌తో పాటు ఇషాన్, శ్రేయస్, అక్షర్ పటేల్‌లను ఔట్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో గెలుపు దిశగా సాగుతున్న భారత్ ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (12) కూడా నిరాశపరిచాడు. చివర్లో గుర్నూర్ బ్రార్ (18*), అర్ష్‌దీప్ సింగ్ (15*) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 4 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెన్ డకెట్ (141) అద్భుత శతకంతో కదంతొక్కగా, మరో ఓపెనర్ జాకబ్ బెథెల్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 192 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. చివర్లో జో రూట్ (74*) అజేయంగా నిలవగా, జోస్ బట్లర్ (13 బంతుల్లో 41) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు స్కోరును 380 పరుగులు దాటించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

కొత్త తరం క్రికెటర్లకు మిథాలీ రాజ్‌ బూస్ట్‌..

ట్యాగ్లు
ఇండియాఇంగ్లండ్వన్డే సిరీస్లార్డ్స్టీం ఇండియాబీసీసీఐఐసీసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌
రాజకీయాలు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
సినిమాలు

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

న్యాయ విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

న్యాయ విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.
జనరల్

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
టెక్నాలజీ

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం
జనరల్

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం
జనరల్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు
జనరల్

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు
జనరల్

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!