

పాకిస్థాన్ క్రికెట్లో సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ తన జట్టు వైఫల్యాలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇంగ్లండ్తో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మూడో టెస్టుకు ముందే ఏడుగురు ఆటగాళ్లపై వేటు పడటంతో పాటు కోచ్లు సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్ను కూడా తప్పించారు. ఈ పరిణామాలపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో నఖ్వీ ఇతర జట్ల ఓటములను ప్రస్తావించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నఖ్వీ మాట్లాడుతూ బలమైన జట్లు సైతం అప్పుడప్పుడు ఊహించని ఓటములను ఎదుర్కొంటాయని అన్నారు. నమీబియా చేతిలో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిన విషయాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. క్రికెట్లో గెలుపోటములు సహజమని, అయితే జట్టుకు అవసరమైన ఆటగాళ్లను తప్పకుండా ఎంపిక చేస్తామని చెప్పారు. వరుసగా విఫలమయ్యే ఆటగాళ్లను మాత్రం ఇకపై కొనసాగించబోమని, తమకు ప్రతి మ్యాచ్, ప్రతి సిరీస్ ముఖ్యమేనని నఖ్వీ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!