

చెన్నైలోని వీఐటీ క్యాంపస్లో ‘టెక్నో వీఐటీ 26’ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రష్యన్ ఫెడరేషన్ కాన్సులేట్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్ ముఖ్య అతిథిగా, దైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ఉపాధ్యక్షుడు (ఆపరేషన్స్, లాజిస్టిక్స్) అరుళ్సెల్వం హరికృష్ణన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భారత్తో పాటు పలు దేశాలకు చెందిన 15 వేల మందికి పైగా విద్యార్థులు, ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఇంజినీరింగ్, రోబోటిక్స్, కోడింగ్, డిజైన్ తదితర రంగాల్లో పనిచేస్తున్న విద్యార్థులు, యువ నిపుణులను ‘టెక్నో వీఐటీ’ ఒకే వేదికపైకి తీసుకువస్తోందని అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశం లేని ఆవిష్కరణలు దీర్ఘకాలం నిలవవని అరుళ్సెల్వం హరికృష్ణన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందాలనుకునే ప్రతి సమాజానికి విజ్ఞానశాస్త్రం, సాంకేతికత ఎంతో అవసరమని వీఐటీ వ్యవస్థాపకులు, ఛాన్స్లర్ డాక్టర్ జి. విశ్వనాథన్ అన్నారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ జీవీ సెల్వం, ప్రో వైస్ ఛాన్స్లర్ డాక్టర్ టి. త్యాగరాజన్, డైరెక్టర్ డాక్టర్ కె. సత్యనారాయణ్, అదనపు రిజిస్ట్రార్ డాక్టర్ పీకే మనోహరన్, టెక్నో వీఐటీ కన్వీనర్ డాక్టర్ ఎం. జయసుధ తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!