
ఓటీటీ

ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మ్యూనిక్ 2026లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డ్తో స్వర్ణ పతకం సాధించిన భారత షూటర్ ఈషా సింగ్కు తెలంగాణ క్రీడా శాఖ అభినందనలు తెలిపింది. ప్రపంచ స్థాయి క్రీడాకారుల మధ్య ఆమె అద్భుత ప్రదర్శనతో స్వర్ణం సాధించింది.
ఫైనల్లో ఈషా సింగ్ 43 పాయింట్లు సాధించి గత ప్రపంచ రికార్డ్ 42 పాయింట్లను అధిగమించి కొత్త రికార్డ్ నెలకొల్పింది. క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా సలహాదారు ఏ.పీ. జితేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు ఆమెను అభినందించారు. 85 దేశాలకు చెందిన క్రీడాకారుల మధ్య ఈ విజయం తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!