
జనరల్

జ్యోతి సురేఖ వెన్నం, తానిపర్తి చికితరావు, ప్రీతికా ప్రదీప్ లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4లో ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో దక్షిణ కొరియా త్రయాన్ని 231-228 తేడాతో ఓడించిన భారత జట్టు కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుంది.
ఈ విజయంతో జూలై 11న జరిగే స్వర్ణ పతక పోరులో భారత జట్టు కొలంబియాతో తలపడనుంది. అంతర్జాతీయ వేదికపై భారత కాంపౌండ్ ఆర్చరీ జట్టు మరోసారి తన సత్తాను చాటగా, తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం మరో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!