

కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) సువర్ణ మహోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి భారత క్రికెట్ దిగ్గజాలను ఘనంగా సన్మానించింది. మాజీ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, భారత మహిళా జట్టు తొలి కెప్టెన్ శాంతా రంగస్వామి పేర్లను స్టేడియంలోని స్టాండ్లకు పెట్టి వారికి ప్రత్యేక గౌరవం ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అలాగే మాజీ నిర్వాహకులు శ్రీ నాగరాజ్, కెప్టెన్ డాక్టర్ తిమ్మప్పయ్య పేర్లను కూడా ఎం-3, ఎం-4 స్టాండ్లకు పెట్టారు.
గత సంవత్సరం ఇదే మైదానంలో జరిగిన మరో కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన క్రికెట్ దిగ్గజాలు ఎరపల్లి ప్రసన్న, జీఆర్ విశ్వనాథ్, బీఎస్ చంద్రశేఖర్, సయ్యద్ కిర్మాణి, బ్రిజేష్ పటేల్, రోజర్ బిన్నీ, జవగల్ శ్రీనాథ్ వంటి ప్రముఖుల పేర్లతో నేమ్ప్లేట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు సుజిత్ సోమ్ సుందర్, కార్యదర్శి సంతోష్ మేనన్, ప్రతినిధి వినయ్ మృత్యుంజయ, సంయుక్త కార్యదర్శి బికే రవి, మంజునాథ్ తదితరులు హాజరయ్యారు. ఈ గౌరవ కార్యక్రమాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా అభినందించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!