

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నివాస గోడకు రాత్రిపూట నోటీసులు అంటించడంపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ గారే తన నివాస అడ్రస్తో సహా పోలీసులకు సమాధానం ఇచ్చినప్పటికీ, ఆయన లేని ఇంటికి రాత్రివేళ వెళ్లి గేటుకు నోటీసులు అంటించడం దుర్మార్గపు వైఖరికి నిదర్శనమని ట్వీట్ ద్వారా విమర్శించారు.
65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలన్న నిబంధనను కూడా పోలీసులు ఉల్లంఘించారని కేటీఆర్ ఆరోపించారు. పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్పై అవగాహన ఉందా? లేక ప్రతిపక్ష నాయకులను వేధించడమే వారి పని అయ్యిందా? అని ప్రశ్నించారు. చట్టం, న్యాయం, ధర్మంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్న కేటీఆర్, ఈ అక్రమ కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొని, ప్రతి తప్పును తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు.


_1771477764226.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!