
జనరల్

హైదరాబాద్లో కొండా దంపతులు తమ తదుపరి నిర్ణయంపై ముమ్మర చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో వారు కుటుంబ సభ్యులతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. తమ నిర్ణయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు తమ నివాసంలో అనుచరులతో కొండా దంపతులు సమావేశం కానున్నారు. అనుచరుల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కొండా దంపతుల నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!