
రాజకీయాలు

విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచే భరిస్తారు. అయితే ఈసారి ప్రభుత్వంపై భారం పడకుండా ఆ మొత్తం వ్యయాన్ని తమ పార్టీ ఫండ్ నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు సమాచారం.
దేశంలోనే ఓ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ నిర్ణయాన్ని అభిమానులు, మద్దతుదారులు స్వాగతిస్తుండగా, డీఎంకే నేతలు మాత్రం దీనిని కేవలం పబ్లిసిటీ స్టంట్గా విమర్శిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!