

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం ఎయిర్పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంచలన లేఖ రాశారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేఎంవీ సంస్థకు కాంట్రాక్టు అప్పగించిన అంశంపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ నిజానిజాలు వెలుగులోకి తేవాలని కోరారు.
కేవలం 20 శాతం పనులకు రూ.206 కోట్ల కేటాయింపు వెనుక భారీ అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని వంశీ పేర్కొన్నారు. కేఎంవీ సంస్థతో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలను కూడా విచారణలో నిరూపించాలని సవాల్ విసిరారు. విచారణలో అవినీతి జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే తనపై కూడా చట్టప్రకారం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!