
క్రీడలు

తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణ కోసం గొంతెత్తుతామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువత, ప్రజలు పోరాడిన సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణను అవమానించిన శక్తులతో రాజకీయంగా కలిసి నడిచిన వారు ఇప్పుడు రాష్ట్రంపై ప్రేమ చూపించడం ప్రజలను మోసం చేసే ప్రయత్నమని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర హక్కులు మరియు ఆత్మగౌరవాన్ని కాపాడేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని వంశీకృష్ణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మాటలకంటే చేతలను విశ్వసిస్తారని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ఎప్పటికీ రాజీపడదని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!