

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరు సంవత్సరాల విరామం తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్, తన పాలనలో అమెరికా ఆర్థికంగా బలంగా ముందుకు సాగిందని వ్యాఖ్యానించారు. అమెరికాకు దాదాపు 200 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తన పాలన సమయంలో అమెరికన్లు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. అలాగే దేశంలో ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు.
అమెరికా అభివృద్ధి చెందితే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై కూడా పడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు సదస్సులో ఆసక్తికరంగా మారగా, అంతర్జాతీయ వేదిక పై మరోసారి ఆయన ప్రసంగం చర్చనీయాంశంగా నిలిచింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!