
బిజినెస్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్న రూ.4,780 కోట్ల అప్పులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధమైంది. బల్దియాను మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో అప్పుల పంపిణీపై పరిశీలించేందుకు టాస్క్ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు అప్పులను పంచితే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
దీంతో పూర్తి అప్పుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కొత్త కార్పొరేషన్ల ఆర్థిక స్థితి స్థిరపడటంతో పాటు, ప్రజా సేవలు మరియు మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!