

పాలమూరు ప్రజలను నీటి అంశాలపై రాజకీయ ప్రచారాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు సూచించారు. కర్ణాటకలోని గూడూరు ప్రాంతాన్ని సందర్శించి “కర్ణాటకలో నీళ్లు – తెలంగాణలో బీళ్లు” అంటూ చేస్తున్న ప్రచారం పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని చెప్పుకునే వారు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కర్ణాటక ఆనకట్టలపై ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా, భీమా నదులపై బ్యారేజ్-కమ్-బ్రిడ్జిల నిర్మాణానికి డీపీఆర్లు సిద్ధం చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. పాలమూరు రైతులు, ముంపు గ్రామాల అభివృద్ధి, పునరావాసం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!