

వైసీపీ మాజీ మంత్రి, ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గురువారం భావోద్వేగానికి గురయ్యారు. గరివిడి మండలంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బొత్స మేనల్లుడు, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేసిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు, కార్యకర్తలు చిన్న శ్రీనుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పార్టీ కోసం చేసిన సేవలను కొనియాడుతూ మాట్లాడారు. కార్యకర్తలు చిన్న శ్రీను గురించి భావోద్వేగంగా మాట్లాడుతున్న సమయంలో బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టారు. దీంతో సమావేశంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!