

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును మంచి దిశగా తీర్చిదిద్దుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు.
విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న ‘అభ్యుదయం’ సైకిల్ ర్యాలీని మంత్రి అనిత బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రారంభించారు. యువతకు ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు.
ప్రజల్లో అవగాహన పెంచేందుకు అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 25 రోజుల పాటు సుమారు 500 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ప్రారంభ కార్యక్రమంలో మంత్రి అనితతో పాటు డీఐజీ, ఎస్పీ కూడా సైకిల్ తొక్కుతూ పట్టణ శివారు వరకు పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!