

అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తీసుకొచ్చిన అథ్లెట్ ఎర్రాజి జ్యోతి కి గ్రూప్-ఐ ఉద్యోగం మరియు నివాస స్థలాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. క్రీడాకారులను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ ముందుంటుందని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. ఈ నిర్ణయానికి ఐటీ మరియు హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని, జ్యోతి కి పెద్ద అన్నయ్యలా అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
క్రీడల అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అంకితభావాన్ని రవినాయుడు ప్రశంసించారు. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి రుజువు అయిందని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం, మంత్రి నారా లోకేష్ గారి ముందడుగు వల్లే ఈ నిర్ణయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఎర్రాజి జ్యోతి కి అండగా నిలిచిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ గారు మరియు రాష్ట్ర క్యాబినెట్ సభ్యులందరికీ శాప్ చైర్మన్ రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!