
సినిమాలు

బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి జగిత్యాలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖండించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ఆడబిడ్డపై దారుణం జరిగినప్పటికీ కనీస స్పందన కూడా లేకపోవడం బాధాకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఖరికి అనేక కారణాలు ఉన్నాయని, రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందని ఆరోపించారు.
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 87 కింద కిడ్నాపింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని సాన్నిహిత్యం కారణంగా బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ, బండి సంజయ్ కుమార్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!