

ఆర్ అండ్ బీ శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్లకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు అందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులతో ఉన్న పెండింగ్ సీనియారిటీ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గురువారం ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయంలో ఆర్ అండ్ బీ ఇంజినీర్ల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు–భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఉద్యోగుల కోరిక మేరకు కొత్త సంవత్సరంలో అన్ని హంగులతో కూడిన ఆడిటోరియాన్ని నిర్మిస్తామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా చరిత్రలో తొలిసారిగా ఆర్ అండ్ బీ రోడ్ పాలసీని ఆవిష్కరించుకున్నామని, ఇది శాఖ విజన్కు నిదర్శనమని పేర్కొన్నారు. మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, గ్రీన్ఫీల్డ్ హైవేలు వంటి పలు కీలక ప్రాజెక్టులతో శాఖ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అతిపెద్ద శాఖగా ఆర్ అండ్ బీని కొనియాడుతూ, ఉద్యోగులంతా నిబద్ధత, నిజాయతీ, బాధ్యతతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం మంత్రి ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!