
టెక్నాలజీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభన మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సంప్రదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన ఛాంబర్లో రాహుల్తో సమావేశమైన రిజిజు, డీలిమిటేషన్ బిల్లు మరియు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులపై కాంగ్రెస్ సహకారం అందించాలని కోరినట్లు సమాచారం.
అయితే ప్రభుత్వ అభ్యర్థనను రాహుల్ గాంధీ తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పోలీసుల చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన వెలువడే వరకు సభ సజావుగా సాగదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో పార్లమెంట్లో ప్రతిష్టంభన మరింత కొనసాగవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!