
న్యూస్

తెలంగాణలో ఇవాళ రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకుని ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం మేడిగడ్డకు చేరుకుని నీటిపారుదల అధికారులతో సమీక్ష నిర్వహించి, కాటారం మండలం నస్తూర్ పల్లిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇవాళ జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఆయన సమక్షంలో జీవన్ రెడ్డి పార్టీ లో చేరనున్నారు. ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించి, అనంతరం బహిరంగ సభలో పాల్గొని, తరువాత రోడ్డు మార్గాన ఎర్రవల్లికి వెళ్లనున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!