

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారాలని దేశ ప్రజలు చాలా కాలంగా కోరుకున్నారని, ఆ ఆకాంక్షను అక్కడి ప్రజలు నెరవేర్చారని అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఫలితాల ప్రభావం తెలంగాణపైనా సానుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని, అందుకే భారీ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోందని తెలిపారు. గత ప్రభుత్వాల పాలనలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం జరిగాయని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక వ్యవస్థను గత ప్రభుత్వాలు ధ్వంసం చేశాయని, దీంతో యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. దక్షిణాదిలో కూడా బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్ వరకు పాదయాత్ర చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!