
టెక్నాలజీ

పోలవరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలో ఏర్పడే ముంపు ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టు పూర్తికాకముందే ముంపు బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ అంశంపై సాంకేతిక అధ్యయనం కోసం ఐఐటీ హైదరాబాద్తో త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర అంచనాల ప్రకారం పోలవరం ప్రభావంతో సుమారు 900 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, ప్రాజెక్టు పూర్తికాకముందే బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు వేగవంతం చేయాలని సూచించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!