
క్రీడలు

విపక్ష పార్టీల నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలైన లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగకపోవడంతో స్పీకర్, ఛైర్మన్ సభలను వాయిదా వేశారు.
ఇక నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముందుగా రాజీనామా చేయాలని కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష కూటమి పట్టుబట్టింది. మంత్రి రాజీనామా అనంతరమే చర్చల్లో పాల్గొంటామని ప్రతిపక్షాలు స్పష్టం చేయడంతో పార్లమెంట్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!