

అమెరికాలో మెడికేర్ పథకాన్ని దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు భారత సంతతికి చెందిన ల్యాబ్ యజమాని ఖాదీర్ ఖాన్ మహ్మద్పై వచ్చాయి. టెక్సాస్లోని రిచర్డ్సన్లో జన్యు పరీక్షల ల్యాబ్ను నిర్వహిస్తున్న 46 ఏళ్ల ఖాదీర్.. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య జన్యు పరీక్షలకు సంబంధించి సుమారు 93 మిలియన్ డాలర్ల మెడికేర్ క్లెయిమ్లకు దరఖాస్తు చేయించినట్లు అధికారులు తెలిపారు. అందులో 65 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.620 కోట్ల మేర క్లెయిమ్ అయినట్లు పేర్కొన్నారు.
అయితే, వైద్యుల సూచనలు లేకుండానే జన్యు పరీక్షలకు క్లెయిమ్లు దాఖలు చేసినట్లు, లబ్ధిదారులకు ఎలాంటి చికిత్స అందించకపోయినా ఈ ప్రక్రియ కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైద్యుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి మోసానికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఖాదీర్ పాత్రపై దర్యాప్తు ప్రారంభించిన టెక్సాస్ అధికారులు.. అతడిపై అభియోగాలు నమోదు చేసి పరారీలో ఉన్న వ్యక్తుల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్లో ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!