

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతవరకు పశ్చిమ బెంగాల్లో మహిళలకు భద్రత ఉండదని అన్నారు. బంగాల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మహిళలపై దాడులు చేసే నిందితులకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, భాజపా అధికారంలోకి వస్తే దారుణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో బాలికలు తరచుగా అదృశ్యమవుతున్న ఘటనలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శించారు. రైతులు, కార్మికులు, మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జనపనారకు కనీస మద్దతు ధర పెంచడం, కొన్ని పంటలకు జూట్ ప్యాకేజింగ్ తప్పనిసరి చేయడం వంటి చర్యలను ప్రస్తావించారు. హుగ్లీ ప్రాంతంలోని మూసివేసిన పరిశ్రమలను తిరిగి ప్రారంభిస్తామని, అక్రమ చొరబాట్లను అడ్డుకుని బెంగాల్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!