

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించడంపై మంగళవారం లోక్సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ప్రహ్లాద్ జోషి గతంలో బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని, లేకపోతే ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేసింది. దీనికి స్పందించిన ప్రియాంక గాంధీ, ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తమ వద్ద ఉందని, అవసరమైన ఆధారాలను సభకు సమర్పిస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, విద్యాశాఖ బాధ్యతలను ఇతర మంత్రుల్లో ఎవరికైనా అప్పగించవచ్చని, ప్రహ్లాద్ జోషి ఎంపికపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!