
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ వీడియో విడుదల చేసి ‘మక్కల్ మేడై’ (ప్రజా వేదిక) అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. మార్పు కోరుకునే ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో చేరాలని ఆమె పిలుపునిచ్చారు.
విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి రంగాల్లో అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఈ వేదికలో రిటైర్డ్ అధికారులు, ఉపాధ్యాయులు, నిపుణులు కూడా పాల్గొనవచ్చని ఆమె తెలిపారు. ఇది కేవలం సంస్థ కాదని, ప్రజాసేవ కోసం ఒక వేదిక అని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో అన్నామలై కొత్త సంస్థ ప్రారంభించిన నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!