
జనరల్

కల్వకుంట్ల కవిత, కేటీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. ఆయనను “వీకెండ్ ఎమ్మెల్యే”గా అభివర్ణిస్తూ ప్రజా సమస్యలపై ఆయనకు ఆసక్తి లేదని ఆరోపించారు. గురువారం రాత్రి సిరిసిల్లలో పర్యటించిన ఆమె అంబేద్కర్, పూలే, సావిత్రి భాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి, అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు.
సిరిసిల్ల సెస్ విలీనం, రైతుల సమస్యలు, డిస్కం ఏర్పాటు అంశాలపై కేటీఆర్ స్పందించలేదని కవిత విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. సిరిసిల్లలో 480 ఎకరాలకు మాత్రమే, వేములవాడలో 77 వేల ఎకరాలకు నీరు అందడం లేదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు, దళితులు, బీసీలపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే యువతకు స్వయం ఉపాధి కోసం 2 కోట్ల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!