

దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల పొదుపును తగలబెట్టేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2014లో రూ.71.41గా ఉన్న పెట్రోల్ ధరను 2026 నాటికి ఢిల్లీలో రూ.102.12కు తీసుకెళ్లారని విమర్శించారు. రెండు వారాల్లోనే నాలుగోసారి ఇంధన ధరలు పెంచడం ప్రజలపై జరుగుతున్న రోజువారీ దోపిడీ అని పేర్కొన్నారు.
గత 12 ఏళ్లలో ఇంధన పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ.43 లక్షల కోట్లు వసూలు చేసిందని ఖర్గే ఆరోపించారు. తాజా ధరల పెంపుతో హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు భారీగా పెరిగాయని, ప్రజల అవసరాల కంటే లాభాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు. నేటి నుంచి లీటర్ పెట్రోల్పై రూ.2.84, డీజిల్పై రూ.2.86 పెరిగాయి. దీంతో హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ ధర రూ.103.74కు చేరింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!