
జనరల్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9వ తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 9, 10 తేదీల్లో సంస్మరణ సభలను నిర్వహించనుంది.
ఈ సంస్మరణ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 9వ తేదీన, మాజీ మంత్రి హరీశ్ రావు 10వ తేదీన పాల్గొననున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!