

కర్ణాటక కేబినెట్ విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కక అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గట్టి సందేశం ఇచ్చారు. ఎవరైనా రాజీనామా చేస్తానంటే వారిని ఎవరూ ఆపరని, అలాంటి రాజీనామాను తాను నిమిషాల్లోనే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఓర్పు ఎంతో అవసరమని, అవకాశాలు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాయని ఎమ్మెల్యేలకు సూచించారు.
రాజకీయ జీవితంలో సహనం ఎంత ముఖ్యమో వివరిస్తూ ధరమ్ సింగ్, సిద్ధరామయ్య, బంగారప్ప, వీరేంద్ర పాటిల్, మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ సీనియర్ నేతల రాజకీయ ప్రయాణాలను ఉదాహరణగా ప్రస్తావించారు. తొలుత అవకాశాలు రాకపోయినా, తర్వాత ఉన్నత పదవులు చేపట్టారని గుర్తుచేశారు. వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన సీఎం, అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను పార్టీ సీనియర్ నాయకులకు అప్పగించినట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!