
జనరల్

మమతా బెనర్జీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీవీకేపార్టీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ కు విషెస్ తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలు, విశ్వాసం, ప్రజాస్వామ్య సంకల్పానికి ఈ తీర్పు ప్రతిబింబమని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
విజయ్ నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధి, సంక్షేమం, సమగ్ర పురోగతి దిశగా మరింత ముందుకు సాగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అంకితభావంతో సేవలు అందించడంలో విజయ్ ప్రభుత్వం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. విజయ్ చారిత్రాత్మక రాజకీయ విజయానంతరం మమతా బెనర్జీ చేసిన ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!